ప్రియ కారుమంచి // ప్రకృతి ..నేను //
3 /12 / 20012
ప్రకృతే .........పాఠశాల
పరిసరాలే.... పుస్తకాలు !
కడలి కెరటం చెప్పింది
పడేది మళ్లీ లేచెందుకేనని !
దుమికే జలపాతం చెప్పింది
కిందపడ్డా ముందుకు సాగెందుకేనని !
కదిలే నది చెప్పింది
గమనం గమ్యం కొరకేనని !
సప్తవర్ణాల హరివిల్లు చెప్పింది
రంగులలోకం నిజం కాదని !
నిశిరాత్రి చందమామ చెప్పింది
చీకట్లో చిరుదీపం కమ్మని !
మెరిసే నక్షత్రాలు చెప్పాయి
మంచి నేస్తాలని పెంచుకొమ్మని !
పచ్చని అడవి చెప్పింది
కుందేళ్ళ తో పాటూ తోడేళ్ళూ ఉంటాయాని !
పాడే కోయిల చెప్పింది
మనసు తో మాటాడాలని !
నాట్యమాడే మయురం చెప్పింది
ఆనందం నాలోనే ఉందని !
ఎగిరే గువ్వ , ఈదే చేప ఇలా అన్ని చెప్పాయి
నింగి ఎత్తు , సంద్రం లోతు చూసి భయపడోద్దని !
కురిసే వానచినుకు చెప్పింది
చివరికి చేరేది మట్టిలోకేనని !
ప్రకృతి మాత్రం తన మనసు విప్పి అన్నీ చెప్పింది నాకు
సాటి మనిషి మనసు మాయా , మర్మం మాత్రం
..........నాకు తెలియటంలేదు........ !!
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.